ఆకలితో అలమటిస్తున్న మూగజీవాలు..దొంతి గోశాలలో దుస్థితి..దాతల కోసం ఎదురుచుపులు

ఆకలితో అలమటిస్తున్న మూగజీవాలు..దొంతి గోశాలలో దుస్థితి..దాతల కోసం ఎదురుచుపులు

శివ్వంపేట, వెలుగు: గోశాల సంరక్షణ లేకపోవడంతో మూగజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి. వాటి పరిరక్షణ పట్టించుకునే వారు లేకపోవడంతో 70 మూగజీవాలు రోధిస్తున్నాయి. శివ్వంపేట మండల పరిధి దొంతి వేణుగోపాల స్వామి ఆలయం వద్ద గోశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గతంలో నిర్వహణ బాధ్యలు తీసుకున్న వారు తప్పుకోవడంతో ప్రస్తుతం జీవాల సంరక్షణ జరగడంలేదు. గోశాలలో గ్రాసం లేకపోవడంతో ఆవులు కేవలం నీరు తాగుతూ ఆకలితో అలమటిస్తున్నాయి.

 ఆరు రోజుల నుంచి గోవులను మేత కోసం బయటకు తీసుకువెళ్లకపోవడంతో బక్కచిక్కాయి. దీనికి తోడు పరిసరాలు ఆపరిశుభ్రంగా మారాయి. దాతలు ముందుకు వచ్చి గాసం అందివ్వడంతో పాటు గోశాల పరిరక్షణ కోసం తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పశువైద్య సిబ్బంది ఆవులకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంది.